Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయసారధిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి:మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - వలిగొండ
కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో పేదలకు భూ పంపిణీ, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉచిత విద్యుత్, సంక్షేమ కార్యక్రమాలు అందాయని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా వామపక్షాలు బలపర్చిన విజయసారధిరెడ్డిని గెలిపించాలని కోరు తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, సీపీఐ నాయకులు బోడ సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమూ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. భ్రమలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజావ్య తిరేక విధానాలకు పాల్పడుతున్న అవకాశవాద బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాడే వారు చట్టసభలకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రయివేటు పరం చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లు తీసుకొచ్చి స్వేచ్ఛా మార్కెట్ పేరుతో కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అనుకూలంగా సంస్కరణలు అమలు చేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాత కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి.జహంగీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, నాయకులు వేముల మహేందర్, బలగాని సత్యనారాయణ, మంగ నరసింహులు, కల్లూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.