Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా పండగ సెలవును ఈనెల 25 నుంచి ఈనెల 26కు రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో నెంబర్ 1609) జారీ చేశారు. విజయ దశమి పండగ ఈనెల 25న జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 25నే దసరా సెలవు అని ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 26న దసరా పండగ జరపాలని పలువురు పంచాంగ కర్తలు ప్రకటించారు. దీంతో ఈనెల 26న సెలవు ప్రకటించాలని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవును ఆదివారం నుంచి సోమవారానికి మార్చామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సోమవారం ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాధారణ సెలవుగా ప్రకటించడం గమనార్హం.