Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్న ధాన్యానికి మద్దతు ధర పెంచాలి : జక్కలి ఐలయ్యయాదవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మక్కలను మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, సన్న వరి ధాన్యానికి మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారనీ, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం తగదని సూచించారు. మక్కల కొనుగోలు కేంద్రాలేకపోవడంతో తొమ్మిది వందల రూపాయలకే దళారులు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని వాపోయారు. కేంద్రం ప్రకటించిన రూ.1850కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల రూపాయలు కలిపి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న రకం ధాన్యం రూ.2500 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కామారెడ్డి, జగిత్యాలలో ఆందోళన చేసిన రైతులను అరెస్టు చేయడాన్ని ఖండించారు.