Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈవోకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల నమోదును తిరస్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) శశాంకగోయల్కు ఆయన శుక్రవారం లేఖ రాశారు. ధ్రువపత్రాలను ఫొటోకాపీ తీసి పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకుంటున్నారని వివరించారు. సొంత సంతకంతోపాటు గెజిటెడ్ అధికారి సంతకంతో ధ్రువపత్రాలను జతపరిచి ఆఫ్లైన్లో దరఖాస్తు చేయొచ్చని తెలిపారు. కానీ ఆన్లైన్లో ధ్రువపత్రాలు పొందుపరిచేటపుడు దుర్వినియోగం చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఒరిజినల్ ధ్రువపత్రాలు పొందుపర్చాల్సిన అవసరం లేనందున బోగస్ ఓట్ల నమోదుకు ఆస్కారముంటుందని సూచించారు. ఒరిజినల్ ధ్రువపత్రాలు పొందుపరచని ఓట్ల నమోదును తిరస్కరించాలని కోరారు.
అధ్యాపకులను నియమించాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
కళాశాలలు, పాఠశాలల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయులను నియమించాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబరు నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైన నేపథ్యంలో... వీరి నియామకాలు తప్పనిసరి అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రస్తుతం ఆన్లైన్ పాఠాల్లో ఎలాంటి సందేహాలు తలెత్తినా రెగ్యులర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారని తెలిపారు.