Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ రిటైల్ చెయిన్ బిగ్'సి' ప్రకటించిన 'ఫెస్టివ్ ధమాకా ఆఫర్'లో తొలి లక్కీ డ్రాను తీసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్కు మంచి స్పందన వస్తుందని బిగ్ సి ఫౌండర్, సిఎండి యం బాలు చౌదరి తెలిపారు. తమ స్టోర్లలో ఉత్పత్తులను కొనుగోలు చేసే వారిలో లక్కీడ్రాల ద్వారా 100 మంది విజేతలను ఎంపిక చేసి, వారికి ఒక్కోరికీ రూ.1 లక్ష బహుమతిని అందించనున్నామన్నారు. తొలి లక్కీ డ్రాలో జి కిరణ్ కుమార్, ఎ ఉమా మహేశ్వర రావు, శ్యామల సునీత, ఇ. లోకేశ్వర్ రెడ్డి, ఆర్ హుసెన్, రాకేష్ కుమార్, భాస్కర్ రావు, మల్లేశ్వర్ రావు, పి గోపి విజేతలుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ సి డైరెక్టర్లు వై స్వప్ప కుమార్, కైలాశ్ లఖ్వాని, బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.