Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే అభివృద్ధి సాధ్యం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలనివ్వాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్రాన్ని కోరారు. అలాంటి సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ప్లీనరీ సందర్భంగా శుక్రవారం వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి స్వయం ధృవీకరణ పత్రం (సెల్ఫ్ సర్టిఫికెట్) ఇస్తున్నామని తెలిపారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకూ 28 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. ప్రస్తుత పారిశ్రామిక వేత్తల వాటా ఇందులో 23 శాతంగా ఉందని చెప్పారు. యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలకు తెలంగాణలో కేంద్ర కార్యాలయాలున్నాయని గుర్తుచేశారు. ఐటీతోపాటు లైఫ్ సైన్సెస్లోనూ రాష్ట్రం మేటిగా నిలిచిందని వివరించారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్లో 35 శాతం ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు.
ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి అనే మూడు లక్ష్యాలతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని వివరించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ... 'వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్'గా మారిందని తెలిపారు. రాబోయే తరాలకు కావాల్సిన టీకాలు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.