Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహనీయుల జయంతి ఉత్సవాలకు అధికారికంగా నిర్వహణ కమిటీలను నియమించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ మహనీయులను గౌరవించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని విమర్శించారు. కొవిడ్-19 సాకుతో బీసీ మహనీయులను విస్మరిస్తున్నదని ఆరోపించారు. పేరుకు జీవోలు ఇచ్చి కమిటీలను వేయకుండా ఏదో చేశామా అంటే చేశామా అన్నట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల సభలను భారీ స్థాయిలో నిర్వహణకు అనుమతిస్తూ బీసీ మహనీయుల జయంతులకు మాత్రం కరోనా అంటూ కుంటిసాకులు చెబుతున్నారని చెప్పారు. అన్లాక్-5 లో వంద మందితో సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చని అనుమతించినా పట్టించుకోవడం లేదని చెప్పారు. వెంటనే ఈ నెల 31న జరిగే మహర్షి వాల్మికి జయంతికి నిర్వహణ కమిటీని వేసి, రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.