Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘటన
నవతెలంగాణ - మెట్పల్లి
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ గిరిజన బాలికపై సాముహిక లైంగికదాడి జరిగింది. ఈదాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మెట్పల్లి పట్టణంలోని వట్టివాగు సమీపంలో గిరిజన బాలిక(16)పై కొద్ది రోజుల కిందట వరసకు సోదరుడైన యువకుడు, అతడి స్నేహితులు నలుగురితో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. లైంగికదాడికి సంబంధించిన దృశ్యాలను ఐదుగురిలో ఒకరు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాధిత కుంటుంబీకులకు విషయం తెలిసింది. దాంతో బాధితురాలి తల్లి శనివారం సాయంత్రం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ గౌస్బాబా తెలిపారు.