Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో: హైదరాబాద్
రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కోవిడ్-19 నిబంధనలను పాటించి పండుగను జరుపుకోవాలని సూచించారు.