Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దుబ్బాక ఉప ఎన్నికలో కారును అడ్డుకుంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్కు గతంలో ఇచ్చిన హామీలు గుర్తొస్తాయని టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. రైతులపోరాట ఫలితంగా మొక్కజొన్న మద్దతు ధరకు కొంటామనీ, ఎన్నికల కోసం ఉద్యోగులకు డీఏ ఇస్తామని ప్రకటించడం ప్రజల నైతిక విజయమని చెప్పారు. ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆడపడుచులకు సద్దుల బతకమ్మ పండుగ సందర్భంగా ఉత్తమ్ హదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర బృందానికి నివేదిక ఎందుకివ్వలేదు?: కిసాన్ కాంగ్రెస్
పంట, ఆస్తి నష్టంపై అంచనా వేసి కేంద్ర బృందానికి నివేదిక సమర్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, రాష్ట్ర చైర్మెన్ అన్వేష్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ వరదలను రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. శనివారం గాంధీభవన్లో వారు విలేకర్లతో మాట్లాడారు. వరి ఎకరానికి రూ 20 వేలు, పత్తి, ఇతర పంటలకు ఎకరానికి రూ 30 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ దాటరా? : కాంగ్రెస్
వరద బీభత్సం సృష్టించిన దెబ్బకు పంటలు పాడైపోయి, లోతట్టు ప్రాంతాలు జలమయమైనా ప్రగతిభవన్ దాటి ప్రజల బాధలు చూడరా? అని సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ ప్రశ్నించింది. శనివారం గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్కుమార్ తదితరులు విలేకర్లతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరద బాధితులకు సాయం చేస్తున్నారు తప్ప ప్రజలపై ప్రేమతో కాదన్నారు.