Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని క్రీడా మైదానాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్రీడా శిక్షణ కొనసాగించాలని క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. క్రీడల అభివద్ధికి జిల్లాలో ప్రతి క్రీడాధికారి ఉండాలని అన్నారు. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న డివైఎస్వో పోస్టుల్లో క్రీడా శాఖ అధికారులను ఇన్చార్జిలుగా నియమించాలని లేదా ఔట్సోర్సింగ్ విధానం ద్వారా ఎంపిక చేసి వెంటనే నియమించాలని క్రీడాశాఖ ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు. ఈమేరకు క్రీడలు, యువజన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహబూబ్నగర్లో ఇండోర్ స్టేడియం స్ధాపనకు పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదికను తయారుచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేయబోయే వాలిబాల్, బాక్సింగ్, ఆర్చరీ, హ్యాండ్బాల్,అథ్లెటిక్స్ అకాడమీల ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.