Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూరాల 9 గేట్లు, ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ -ధరూర్/మెండోరా
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూర ాల ప్రాజెక్టుకు నారాయణ పూర్ డ్యాం నుంచి 58వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు పేర్కొన్నారు. ఎగువ నుంచి 1,56,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులో 9.640 టీఎంసీల నీరు నిల్వ ఉంచి 9 గేట్ల ద్వారా 93,770 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జల విద్యుత్ కేంద్రం ద్వారా 30,331 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లలో ఒక యూనిట్కి 39 మెగావాట్ల చొప్పున 195 మెగావాట్ల విద్యుత్తు తయారీని వెల్టూరుకు వదులుతున్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు.మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 25,359 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు డీఈ జగదీష్రెడ్డి తెలిపారు. దాంతో 4 గేట్ల ద్వారా 12,500, 4 ఎస్కేప్ గేట్ల ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదుతున్నారు. ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా 3000, లక్ష్మి కాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల సాగునీటిని అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా 152 క్యూసెక్కులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.