Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులో దూకి యువకుడి బలవన్మరణం
నవతెలంగాణ-డిచ్పల్లి
ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దీపూర్ చెరువులో శనివారం జరిగింది. ఎస్ఐ సురేష్కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్ (32) కులవృత్తయిన కల్లు తీసుకుంటూ జీవనం సాగించేవాడు. కరోనా ఆంక్షలతో కొంతకాలంగా ఉపాధి కరువై ఆర్థిక పరిస్థితి బాగాలేక మనస్తాపం చెందుతుండేవాడు. అయితే శుక్రవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం చెరువులో మృతదేహం పైకి తేలడంతో గ్రామస్తులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.