Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మ అలంకరణలో వాడే తామర పూలు కోసుకురావడానికి చెరువుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. వెంకట్రావు పేటకు చెందిన పోనగంటి సమ్మయ్య(40) శనివారం బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ శివారులోని చెరువులో తామరపూలు కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. పండుగను ఆనందంగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.