Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రామ రెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేట జిల్లాలో నిష్పక్షపాతంగా దుబ్బాకలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డా. శ్యామ్లా ఇక్బాల్ను నియమించినట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. సిద్దిపేట విద్యుత్ గెస్ట్ హౌస్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. శ్యామ్లా ఇక్బాల్ పోలింగ్ ముగిసే వరకు అందుబాటులో ఉంటారన్నారు. ముందస్తు అపాయింట్మెంట్తో రాజకీయ పార్టీల ప్రతినిధులు దుబ్బాక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కలవవచ్చునని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఫిర్యాదులుంటే తెలియజేయవచ్చు నని సూచించారు. నేరుగా వచ్చి కలవలేని వారు 9515184620 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు.