Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి మూడు ర్యాంకులు వారివే
- ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు టాపర్
- సంగారెడ్డి వాసి బారెడ్డి సాయి త్రిషారెడ్డికి రెండో ర్యాంకు
- హైదరాబాద్ వాసి తుమ్మల స్నికితకు మూడో ర్యాంక్
- అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 92.57 శాతం ఉత్తీర్ణత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఫలితాల్లో అమ్మాయిలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. తొలి మూడు ర్యాంకులు కైవసం చేసుకుని సత్తాచాటారు. ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు కంబైన్డ్ స్కోర్ 96.0772, ఎంసెట్ మార్కులు 151.8981 సాధించి టాపర్గా నిలిచారు. సంగారెడ్డికి చెందిన బారెడ్డి సాయి త్రిషారెడ్డి కంబైన్డ్ స్కోర్ 96.0476, ఎంసెట్ మార్కులు 151.8216తో రెండో ర్యాంకు పొందారు. హైదరాబాద్కు చెందిన తుమ్మల స్నికిత కంబైన్డ్ స్కోర్ 95.9997, ఎంసెట్ మార్కులు 151.8216తో మూడో ర్యాంకు సాధించారు. తుమ్మల స్నికిత నీట్లోనూ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు పొందడం గమనార్హం. టాప్టెన్లో తొలి మూడు ర్యాంకులు అమ్మాయిలు, మిగిలిన ఏడు ర్యాంకులు అబ్బాయిలు సాధించారు. టాప్టెన్లో తెలంగాణకు చెందిన వారు ఐదుగురు, ఏపీకి చెందిన వారు ఐదుగురు ఉన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
జేఎన్టీయూ హైదరాబాద్లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్ ఈ ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు వేర్వేరుగా ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 78,981 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, గతనెల 28,29 తేదీల్లో జరిగిన రాతపరీక్షలకు 63,857 మంది హాజరయ్యారు. వారిలో 59,113 (92.57 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో అబ్బాయిలు 18,377 మంది, అమ్మాయిలు 40,736 మంది ఉన్నారు. వచ్చేనెలలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని పాపిరెడ్డి వివరించారు. ర్యాంకు కార్డుల కోసం http://eamcet.tsche.ac.in వెబ్సైట్ను చూడాలని సూచించారు.
టాప్టెన్ ర్యాంకర్ల వివరాలు
ర్యాంకు పేరు జిల్లా కంబైన్డ్ స్కోర్
1 గుత్తి చైతన్య సింధు గుంటూరు 96.0772
2 బారెడ్డి సాయి త్రిషారెడ్డి సంగారెడ్డి 96.0476
3 తుమ్మల స్నికిత (నీట్ 3వ ర్యాంకు) హైదరాబాద్ 95.9997
4 దర్శి విష్ణు సాయి నెల్లూరు 94.2384
5 మల్లిడి రుషిత్ ఖమ్మం 94.2222
6 శ్రీమల్లిక్ చిగురుపాటి మేడ్చల్ 94.0806
7 ఆవుల సుభాంగ్ హైదరాబాద్ 3.8284
8 గారపాటి గుణ చైతన్య కర్నూలు 93.8257
9 గెండేటి వినరుకుమార్ చిత్తూరు 93.7420
10 కోట వెంకట్ కృష్ణా 93.7361
ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఫలితాల వివరాలు
దరఖాస్తు చేసిన అభ్యర్థులు : 78,981
రాతపరీక్షలకు హాజరైన వారు : 63,857
ఉత్తీర్ణత పొందిన వారు : 59,113
ఉత్తీర్ణత శాతం : 92.57