Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ డిజిటల్ ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 37 మంది గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, టీ అండ్ పీ డైరెక్టర్ నాతి వేణుకుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాల్లో 10 మంది టీసీఎస్ డిజిటల్కు, 27 మంది టీసీఎస్ నింజాకు ఎంపికయ్యారని వివరించారు. ప్రీ ప్లేస్మెంట్ టాక్, కోడింగ్లో ఆన్లైన్ పోటీపరీక్షల తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిపారు. కరోనా నేపథ్యంలో నియామకాలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు. టీసీఎస్ డిజిటల్కు ఎంపికైన బీటెక్ విద్యార్థులు రూ.7 లక్షలు, పీజీ విద్యార్థులు రూ.7.33 లక్షలు వార్షిక వేతనం అందుకుంటారని తెలిపారు.