Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందే గడువును గురువారం వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయడం గురువారం వరకు అవకాశముందని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు బుధవారంతో ముగియనున్న విషయం తెలిసందే. ఇప్పటి వరకు 36,659 మంది విద్యార్థులు సెల్ఫ్రిపోర్టింగ్ చేశారని వివరించారు. ఇంజినీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్లో 50,137 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించిన సంగతి విదితమే. రాష్ట్రంలో 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో 70,135 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి.