Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో సంవత్సరం పాత బ్యాచ్ విద్యార్థుల పరీక్షలు ఈనెల 31 నుంచి వచ్చేనెల 2 వరకు జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ లక్ష్మారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కుండపోత వర్షాల కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేసిన విషయం విదితమే.