Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో ఈనెల 25న దళితులపై జరిగిన దాడిని పీడీఎస్యూ (విజృంభణ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవుల నాగరాజు, కె ఆనంద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రామోజీపేటలో దళితులపై దాడి చేసిన వారిని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని సూచించారు.