Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సేంద్రీయ ఎరువుల వినియోగం పంటలకు మేలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంలో రైతులను చైతన్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. శాస్త్రీయ పద్దతిలో రైతులు ఎరువులు ఉపయోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన వ్యవసా య అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాదికి పచ్చిరొట్ట పంట విత్తనాలను సేకరించి అందుబాటులో ఉంచాలన్నారు. రైతుబజార్లలో మిగిలిన జీవ వ్యర్థాలను ఎరువులుగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. యాసంగికి సంబంధించి ఈ నెలాఖరు వరకు ఎరువుల కోటా షెడ్యూల్ ప్రకారం సకాలంలో డ్రా చేసుకోవాలన్నారు. వ్యవసాయశాఖలో అన్ని స్థాయిలలో పదోన్నతులు చేపట్టేందుకు అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలనీ, దీనికి సంబంధించి ఉన్నతా ధికారులు, ఉద్యోగ సంఘాలను కూడా సంప్రదించి సూచ నలు తీసుకోవాలని సూచించారు. పత్తి కొనుగోళ్లలో ఇబ్బం దులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలనీ, ఈ విషయం లో జిల్లా కలెక్టర్లను సంప్రదించాలన్నారు. మొక్కజొన్న సేకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేయా లన్నారు. డిసెంబరులో కందుల సేకరణకు కార్యా చరణ చేపట్టాలని ఆదేశించారు.
రైతు బజార్లతో ఉల్లిగడ్డల అమ్మకాలు
ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లిగడ్డల అమ్మకాలను కొనసాగించాలని మంత్రి చెప్పారు. ఉద్యాన శాఖ యాసంగిలో ఉల్లి పంట సాగు ప్రాంతాలు, ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉల్లి, టమాట ధరలు, సాగు విస్తీర్ణం స్థిరీకరణ కోసం ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు.
వచ్చే ఏడాది ఆయిల్పామ్ సాగు, మొక్కల సేకరణ ప్రణాళికపై ఆరా... ఈ సీజన్ మొక్కల ప్లాంటేషన్ 15 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. గోడౌన్ల స్థలాల పరిస్థితిపై వివరాల సేకరణ చేపట్టాలన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు వ్యవసాయ విస్తరణ అధికారి ఉండేలా ప్రస్తుతం ఉన్న క్లస్టర్ల విస్తీర్ణంలోని హెచ్చు, తగ్గులను సరిచేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, విత్తనాభివద్ధి సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి తదితరులు ఉన్నారు.