Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గిరిజన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బేస్ట అవైలేబుల్ అడ్మిషన్లు ఇస్తున్నారనీ, ఈ ఏడాది కూడా వెంటనే ప్రారంభించాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం సంఘం రాష్ట్రఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో వచ్చిన స్కీం ప్రతి జిల్లాలో వేలాది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. గురుకులల్లో సీట్ల కోసం 1,48,000 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 48 మంది వేల మందికి సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెస్ట అవలేబుల్ అడ్మిషన్లు ప్రారంభించాలని కోరారు.