Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇటీవల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ విజయశాంతితో కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి సమావేశమైన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమకుమార్ను ఆమెను కలిశారు. బుధవారం హైదరాబాద్లో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విజయశాంతిని ఎవరూ కలిసినా మర్యాద పూర్వకంగానే కలిశారని చెప్పారు. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారనీ, పార్టీ వీడబోరని చెప్పారు.
పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమేనన్నారు. కరోనా కారణంగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిని కలువలేక పోయినట్టు వివరించారు.