Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆన్లైన్ తరగతులతో సంబంధం లేకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లను 2020-21 విద్యాసంవత్సరానికి రెన్యూవల్ చేయాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ జరుగుతున్నందున త్వరగా రెన్యూవల్ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. జూన్ నుంచే రెన్యూవల్ చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏడేండ్లుగా 1,500 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని వివరించారు. ఎంటీఎస్, కాంట్రాక్టు, పార్ట్టైం, అవర్లీ బేస్డ్ లెక్చరర్లను రెన్యూవల్ చేశారని గుర్తు చేశారు. కానీ గెస్ట్ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఎనిమిది నెలలుగా ఉపాధి లేక, వేతనాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భౌతిక తరగతులతో రెన్యూవల్ను ముడిపెట్టడం సరైంది కాదని పేర్కొన్నారు.