Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమీకృత కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధిం చిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఏ సంస్థకు దక్కుతుందా అన్న ఉత్కంఠకు తెరపడింది. బిడ్ల లో ఎల్-1గా నిలిచి నిర్మాణ పనుల బాధ్యతను ప్రముఖ సంస్థ షాపూర్జీ-పల్లొంజీ చేజిక్కించుకుంది. 12 నెలల్లోపు నిర్మాణం పనులు పూర్తిచేయాలనే కచ్చితమైన నిబంధ నను ప్రభుత్వం పెట్టింది. టెండర్లు ఖరారైన నేపథ్యంలో బుధవారం హైదరా బాద్లో రాష్ట్ర ప్రభుత్వానికి షాపూర్జీ -పల్లొంజీ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.