Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్షత ఎందుకు చూపిస్తున్నారని అప్పనపల్లి గ్రామంలో గ్రామస్తులు మంత్రి హరీశ్రావును నిలదీశారు. దాంతో టీఆర్ఏస్, బీజేపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి, హాసన్ మీరాపూర్ గ్రామాల్లో మంత్రి హరీశ్రావు ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడిన తర్వాత కొంత మంది గ్రామస్తులు.. 'సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక ఒక కన్ను అంటివి సారూ.. కానీ సిద్దిపేటలోని రంగనాయక సాగర్, గజ్వేల్లోని కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఒక రకమైన ప్యాకేజీ ఇస్తివి, దుబ్బాకలోని మల్లన్న సాగర్ ప్రధాన కాల్వ నిర్వాసితులకు మరొక రకమైన ప్యాకేజీ ఇస్తిరి..' అని మంత్రిని నిలదీశారు. ఎందుకు వివక్షత చూపెట్టారని గ్రామస్తులు అడగటంతో మంత్రి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామస్థులకు మాటామాటా పెరగడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అనంతరం పోలీసులు వచ్చి సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.