Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో 1481 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు 2,34,152 మంది వైరస్ బారిన పడగా, అందులో 2,14,917 మంది కోలుకున్నారు. మరో 17,916 మంది చికిత్స పొందుతున్నారు. కాగా మరో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మొత్తంగా మరణాల సంఖ్య 1319కు చేరింది. మరో 664 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలావుండగా 40,081 మందిని పరీక్షిస్తే అందులో 3.69 శాతం మందిలో వైరస్ బయటపడింది. ప్రతి 10 లక్షల మంది జనాభాకుగాను 1,11,649మందికి మాత్రమే టెస్టులు చేయగలిగారు.
మూడు జిల్లాల్లో వందకు పైగా....
రాష్ట్రంలో మూడు జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 279 కేసులు నమోదు కాగా మేడ్చల్-మల్కాజిగిరిలో 138, రంగారెడ్డిలో 111 ఉన్నాయి. వనపర్తిలో ఒక్క కేసు లేదు. అతి తక్కువగా నారాయణపేటలో నాలుగు, కొమురంభీం ఆసిఫాబాద్లో తొమ్మిది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 ఉన్నాయి.