Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీకి స్కోచ్ సంస్థ బంగారు అవార్డు ప్రధానం
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 వైరస్ నియంత్రణలో తెలంగాణ పోలీసుల పాత్ర బేష్ అని స్కోచ్ సంస్థ అభినందించింది. రాష్ట్ర పోలీసులు బాధ్యతాయుతంగా, ప్రణాళికా బద్ధంగా పని చేసి వేలాది మంది బాధితులకు ఆసరాగా నిలిచారని పేర్కొంది. పోలీసుల నిర్విరామ కృషి వల్ల తెలంగాణాలో నిబంధనల అమలు లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తెలిపింది. ఈ మేరకు పోలీసులు చేసిన అవిరళ కృషికి గాను బంగారు పతకాన్ని అందచేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆన్లైన్ అవార్డుల ప్రధానోత్సవంలో బుధవారం పాల్గొన్న డీజీపీ డాక్టర్.ఎం.మహేందర్రెడ్డి స్కోచ్ సంస్థ నుంచి బంగారు పతకాన్ని అందుకున్నారు. స్కోచ్ సంస్థ నుంచి బంగారు పతకం రావడం సంతోషంగా ఉందని మహేందర్రెడ్డి తెలిపారు. ఈ కీర్తి రాష్ట్ర పోలీసులందరికీ దక్కుతుందని ఆయన అన్నారు.
ఏపీకి 302.. తెలంగాణకు 199మంది డీఎస్పీలు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు పోలీసు అధికారుల తుది కేటాయింపు చేసింది. ఏపీ, తెలంగాణకు నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను కేటాయించింది. 52:48 నిష్పత్తిలో కేంద్రం ఈ కేటాయింపులు జరిపింది. ఏపీకి 16 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 64 మంది అదనపు ఎస్పీలు, 302 మంది డీఎస్పీలు.. తెలంగాణకు 9 మంది నాన్కేడర్ ఎస్పీలు, 49 మంది అదనపు ఎస్పీలు, 192 మంది డీఎస్పీలను కేటాయిస్తూ.. కేంద్ర హౌంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.