Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 నెలల్లో తీర్పు..
నవతెలంగాణ-వరంగల్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ (24) కు ఉరి శిక్ష పడింది. బుధవారం వరంగల్ ఫస్ట్ అడి షనల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్ట్ జడ్జి కావూరి జయకుమార్ తుది తీర్పు వెలువరించారు. గతంలో హన్మకొండ నడిబొడ్డులో 9 నెలల పసిపాపపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడు ప్రవీణ్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కూడా న్యాయమూర్తి కె జయకుమారే కావడం గమనార్హం. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలో ఈ ఏడాది మే 21న గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో 9మందికి నిందితుడు సంజయ్ మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు బీహార్కు చెందిన సంజరుపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నెల రోజుల్లోనే పోలీసులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన 9మందిలో 8మంది పశ్చిమబెంగాల్ నుంచి వలస వచ్చిన కూలీలు కాగా, ఒకరు వరంగల్ కరీమాబాద్కు చెందిన వారు. ఇప్పుడు ఈ కేసులో నూ 5నెలల్లోనే తీర్పు రావడంపట్ల పోలీస్ అధికా రులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరేండ్ల కిందట జీవనోపాధి కోసం వరంగల్ చేరుకున్న నిందితుడు సంజయ్ కుమార్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని శాంతినగర్లోని గోనెసంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. ఇదే కేంద్రంలో పని చేస్తున్న మక్సూద్ ఆలం కుటుంబ సభ్యులతో సంజయ్ కి పరిచయం అయింది. మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకతో పరిచయం పెంచుకున్న నిందితుడు నాలుగేండ్లు సహజీవనం చేశాడు. ఆమె పెండ్లి చేసుకోవాలని కోరినందుకు రఫీకను సంజయ్ హౌరా ఎక్స్ప్రెస్లో బీహార్కు తీసుకువెళ్తూ మార్గమధ్యంలో రైలు ఫుట్బోర్డుపై నుంచి తోసేసి హతమార్చాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నిడద వోలులో జరిగింది. రఫీకా ఇంటికి రాలేదని బంధువులు మక్సూద్ భార్య నిషాకు సమాచారమివ్వడంతో సంజయ్ ని నిలదీసింది. నెల రోజులైనా ఆమె ఆచూకీ తెలియలేదు. ఎప్పుడైనా వ్యవహారం బయటపడుతుందని భావించి మక్సూద్ కుటుంబాన్ని హతమార్చాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ముందే నిద్రమాత్రలు కొనుగోలు చేసి మే 20న అర్ధరాత్రి వారి భోజనంలో కలిపాడు. స్పృహ కోల్పో యాక సజీవంగా ఉన్న వారినే ఒకరి తర్వాత ఒకరిని 9మందిని గోనె సంచుల్లో బావి వద్దకు తరలించి అందులో పడేసి హతమార్చాడు. కాగా నిందితుడు సంజ రుపై సీిఆర్పీసీ 449, 328, 380, 404, 364, 302, 201, 354(సీ) ఐపీసీి, సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసు మిస్టరీని 72 గంటల్లో ఛేదించి సంజరుకుమార్ యాదవ్ను అరెస్టు చేశారు. ఒక్క హత్య కేసును తప్పించుకోవడానికి 9 మందిని సంజరు హతమార్చాడు. ఈ కేసులో 25 రోజుల్లోనే జులై 28న గీసుగొండ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో అవాంతరాలు ఏర్పడగా, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ పూర్తి చేశారు. 475 పేజీల దర్యాప్తు నివేదికను పోలీసులు సమర్పించారు. 98 మంది సాక్షులలో 67 మందిని కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా బుధవారం సంజరుకుమార్ యాదవ్కు కోర్టు ఉరిశిక్ష విధించింది.
పోలీసులపై ప్రజల్లో మరింత గౌరవం పెరిగింది : సీపీ ప్రమోద్కుమార్
గొర్రెకుంటలో తొమ్మిదిమందిని హతమార్చిన సంఘటనలో సంజరుకుమార్ యాదవ్కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ పి ప్రమోద్కుమార్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేరం జరిగిన 5 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మీ, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ సర్ధార్, గీసుగొండ సీఐ శివరామయ్య, ఎస్ఐలు నాగరాజు, అబ్ధుల్ రహీం, కోర్టు కానిస్టేబుల్ లింగయ్యకు సీపీ పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు.