Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ రాక.. భారీ బందోబస్తు
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ 29న హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్త లూ తీసుకున్నారు. మూడు కమిషనరేట్ల పోలీస్ సిబ్బందితో పాటు అదనపు బలగాలను మోహరించారు. సీఎం కేసీఆర్ సభకు గ్రేటర్ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వీఐపీలతోపాటు ముఖ్య నాయకులు దాదాపు రెండు లక్షల మంది వరకు హాజరు అవుతారని భావిస్తున్నారు. పోలీసు లు సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంలతో తని ఖీలు చేశారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు అన్ని చర్యలూ చేపట్టారు. బషీర్బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించారు. సభకు హాజరయ్యేందుకు ట్యాంక్బండ్ మీదుగా వచ్చేవాళ్లు గేట్-జీ ద్వారా, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాళ్లు గేట్-ఏ ద్వారా, ముషీరాబాద్, అంబర్పేట నుంచి వచ్చే వాళ్లకు గేట్-ఎఫ్ ద్వారా సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు.
ఎల్బీ స్టేడియాన్ని సందర్శించిన మంత్రి
ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐడీసీ చైర్మెన్ బాలమల్లు, సివిల్ సప్లైస్ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
పార్కింగ్ నిబంధనలు..
- శనివారం సీఎం బహిరంగ సభ నేపథ్యంలో పెద్దఎత్తున వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
- సికింద్రాబాద్, ట్యాంక్బండ్ మీదుగా వచ్చే వాహనాల కోసం పబ్లిక్గార్డెన్, రవీంద్రాభారతి, ఐమాక్స్ సినిమా థియటర్ సమీపంలోని డాక్టర్ కార్స్ పార్కింగ్ స్థలంలో వాహనాలను నిలుపాలి.
- ఎల్బీస్టేడియం, దిల్సుఖ్నగర్, ఓల్డ్ సిటీ వచ్చే వాహనాలను పబ్లిక్ డార్డెన్, పీపుల్స్ ప్లాజాలో పార్కింగ్ చేయాలి.
- ముషీరాబాద్, అంబర్పేట్,హిమాయత్నగర్ మీదుగా వచ్చేవాహనాలను నిజాంకాలేజీ గ్రౌండ్లో పార్కింగ్ చేయాలి.
- మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు నిజాంకాలేజీలో పార్కింగ్ చేయాలి.