Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కార్యాలయంలోని నర్సింగ్ సెక్షన్్ అధికారి నరేష్ కుమార్పై కొందరు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఓ నరేష్కుమార్పై వచ్చిన ఆరోపణలు తమ దష్టికి వచ్చాయనీ, దీనిపై సహోద్యోగులతో విచారణ జరిపామని తెలిపారు. నిజాయితీ కలిగిన అధికారిపై కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నరేష్ కుమార్కు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎస్సీ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య డిమాండ్ చేశారు. ఆయనపై తనకు తప్పుడు సమాచారమిచ్చారనీ, ఆ తర్వాత రూడీ చేసుకున్న తర్వాత వాస్తవం తెలిసిందని వివరించారు.