Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాజిక విప్లవకారుడు మహాత్మజ్యోతిరావు ఫూలే 130వ వర్థంతి, మార్క్సిస్టు మహౌపాధ్యాయుడు ఎంగెల్స్ జయంతి సందర్భంగా పలువురు నాయకులు వారికి నివాళి అర్పించారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల సంఘాల నాయకులు పి.ఆశయ్య, లెల్లెల బాలకృష్ణ, ఉడుత రవీందర్, మల్లేశం, మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, వెంకట నరసయ్య, ముఠా విజరు తదితరులు హాజరై నివాళులర్పించారు.