Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్ కోటా కింద గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ల నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాం దాఖలైంది. సామాజిక కార్యకర్త ధనగోపాల్రావు దాఖలు చేసిన రిట్ ఆఫ్ కోవారెంట్ వేశారు. గవర్నర్ కార్యదర్శికి వినతిపత్రం ఇస్తే దానిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారనీ, తర్వాత ఎలాంటి మార్పు లేదని, ఎమ్మెల్సీల నియామక జీవో 154 చెల్లదన్నారు. ఆ ముగ్గురినీ ఎమ్మెల్సీలుగా నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నవంబర్ 13న సిఫార్సు చేసిందనీ, మరో రెండు రోజలుకు గవర్నర్ నియామక ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. ఈ వ్యాజ్యంపై విచారణ పూర్తి అయ్యే వరకూ ఎమ్మెల్సీలు బాధ్యతలు స్వీకరించకుండా ఇవ్వాలనే వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్లను ప్రతివాదులుగా చే ర్చారు.
సీబీఐ పెట్టిన కేసు కొట్టేయాలి
హైకోర్టును కోరిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి
పెన్నా సిమెంట్స్కు భూములు లీజుకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ పెట్టిన కేసును కొట్టేయాలని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టును కోరారు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో 231 ఎకరాలు, కర్నూల్ జిల్లాలో సుమారు 500 ఎకరాలు పెన్నా కంపెనీకి లీజుకు ఇవ్వడంపై దాఖలైన కేసులో సీబీఐ అదనపు చార్జిషీటు దాఖలు చేయడాన్నీ, సిబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని ఆమె సవాల్ చేశారు. భూములు లీజుకు ప్రతిఫలంగా పెన్నా కంపెనీ జగన్ కంపెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడి పెట్టిందనీ, ఈ వ్యవహారంలో తాను అధికారిగా చేసిన విధులపై సీబీఐ కేసు పెట్టడం అన్యాయమన్నారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించనుంది.