Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజనశాఖలో ఇద్దరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గిరిజనశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జెడ్.చొంగ్తూ జీ.వో.నెం.155 విడుదల చేశారు. డిప్యూటీ డైరెక్టర్ వి.సైదా మలోత్ కు జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఐ జాయింట్ డైరెక్టర్ పి.కళ్యాణ్ రెడ్డికి జాయింట్ డైరెక్టర్ (ప్లానింగ్)గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
ఎఫ్ డీసీ వీసీ, ఎండీగా దొబ్రియాల్
అటవీ అభివద్ధి సంస్థ (ఎఫ్ డీసీ) వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్.ఎం.దొబ్రియాల్కు పీసీసీఎఫ్- సోషల్ ఫారెస్ట్రీగా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత వీసీ, ఎండీ పి.రఘువీర్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.