Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం
- కారు సారు ఇక రారు..
- రాంనగర్ రోడ్ షోలో బండి సంజయ్
నవతెలంగాణ-రాంనగర్
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని కూలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాంనగర్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రికి రోజు రెండు పెగ్గులు పెరిగాయన్నారు. కారు.. సారు.. ఇక రారు.. అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మంత్రులు దద్దమ్మలని, కనీసం కేసీఆర్ ముందు నిలబడే ధైర్యం లేదని అన్నారు. కేసీఆర్ సభలకు నగర ప్రజలు రాలేదని, గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్తలను తరలించారని అన్నారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా లింగు లింగుమని కేటీఆర్, కేటీఆర్ ఫొటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.