Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలోచించి ఓటు వేయండి.. స్వప్పను గెలిపించాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఓయూ
ప్రజల పక్షాన పోరాడి, వారి సమస్యలు పరిష్కరించే వారినే గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం హైదరాబాద్లోని అడ్డగుట్ట సీపీఐ(ఎం) అభ్యర్థి టి.స్వప్న మహేందర్కు మద్దతుగా సీపీఐ నేత అజీజ్ పాషాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డగుట్ట సీపీఐ(ఎం) అభ్యర్థి స్వప్నకు ఓటేయాలని కోరారు. బీజేపీ మతవిద్వేషాలు, మత ఘర్షణలు పెట్టే యోచనలో ఉందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు. బీజేపీ, ఎంఐఎం మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయన్నారు. వరదలతో విశ్వనగరం విషాద నగరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రశ్నించే గొంతులను గెలిపించాలని కోరారు. కేరళలో ప్రభుత్వమే ఉచితంగా కరోనాకు వైద్యం చేయించిందని, ఇక్కడ కరోనా నివారణకు చర్యలు శూన్యమని అన్నారు. కార్పొరేట్ శక్తులను, డబ్బులు ఇచ్చే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, సికింద్రాబాద్ కార్యదర్శి అజరు బాబు, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.