Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నా
నవతెలంగాణ-చిలిపీఛెడ్
సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతో తమను నిండా ముంచుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెదక్ జిల్లా చిలిపీఛెడ్ మండల పరిధిలోని చిట్కుల్లో మెదక్- జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. సన్న వరి కోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి ధాన్యం తడుస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు ఇవ్వాలని కోరారు. నెల రోజుల నుంచి టార్పాలిన్ల కిరాయి ఎక్కువ అవుతోందని వాపోయారు. మండలంలో ప్రభుత్వం ఒక్క ధాన్యం గింజ కూడా కొనపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.