Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాదాసీదాగా ప్రధాని పర్యటన
- స్వాగతం పలికిన సీఎస్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రధాని నరేంద్రమోడీ హైద రాబాద్ వచ్చారు. ఆయన పర్యటన ఆసాంతం సాదాసీదాగా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన పర్యటన రాజకీయంగానూ ప్రాథా న్యత సంత రించుకుంది. అహ్మదా బాద్ నుంచి ప్రధాని నేరుగా హైదరా బాద్లోని హకీంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రధానికి స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థకు చేరుకున్నారు. అక్కడ కోవ్యాగ్జిన్ టీకా తయారీ, ప్రయోగాలను పరిశీలించారు. శాస్త్రవేత్తలతో టీకా తయారీ, పనివిధానంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ నుంచి పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్కు బయల్దేరి వెళ్లారు. అక్కడా కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ పురోగతిని సమీక్షించారు. హైదరాబాద్కు రావడానికంటే ముందు ప్రధాని నరేంద్రమోడీ అహ్మదాబాద్లోని మోదీ జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్ను సందర్శించారు. తన పర్యటన అనంతరం ప్రధాని ట్విట్టర్ వేదికగా భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్)తో కలిసి పని చేస్తుందని పేర్కొన్నారు. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.