Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 వరకు అవకాశం : ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే నేషనల్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని తెలిపారు. నేషనల్ స్కాలర్షిప్ కోసం రెన్యూవల్, ఫ్రెష్గా దరఖాస్తు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వీటిని విద్యాసంస్థలు పరిశీలించే గడువును వచ్చేనెల 15 వరకు పొడిగించామని పేర్కొన్నారు. రాష్ట్రం లో నేషనల్ స్కాలర్షిప్ కోసం విద్యార్థులు 52,740 మంది ఎంపికయ్యారని వివరించారు. విద్యార్థులు http://scholorships.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. ఎంపికైన విద్యార్థుల వివరాలు tsbie.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.