Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రద్ధ అనాధాశ్రమానికి ఎస్బీఐ మహిళా క్లబ్ అమరావతి సర్కిల్ సభ్యులు నిత్యావసరాలు పంపిణీ చేసింది. 2008లో సుజాత బుర్ల ఈ అనాధశ్రమాన్ని సొంత ఇంట్లోనే స్థాపించారు. గతంలో 35 మంది మహిళలుండేవారు. మారిన నిబంధనల ప్రకారం 25 మంది అబ్బాయిలకు నివాసంతోపాటు విద్యనందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మహిళా క్లబ్ అమరావతి సర్కిల్ అధ్యక్షులు వందన సహారు, శ్రద్ధ మేనేజింగ్ ట్రస్టీ సుజాత బుర్ల, ఇతర సభ్యులు పాల్గొన్నారు.