Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ ఓటమికి కారణమిదే...
- ఆకురౌడీపోయి... రౌడీలాంటి మోడీ దిగారు
- గ్రేటర్ ఫలితాల పై రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చంపేందుకు టీఆర్ఎస్, బీజేపీలు మీడియాకు సుపారి ఇచ్చాయనీ, అందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమే కాదనీ, ప్రజాస్వామ్యాన్ని మీడియా హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ ఓడిపోవటానికి మీడియానే ప్రధాన కారణమనీ, ప్యాకేజీ ఇవ్వలేక ఓడిపోయామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చి సీట్లు గెలిచాయని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆకు రౌడీ లాంటి టీఆర్ఎస్ పోయి మాకు రౌడీలాంటి బీజేపీ వచ్చిందన్నారు. ప్రధానమీడియా విపరీతపోకడలతో ప్రజాస్వామ్యం ఘోరంగా దెబ్బతింటున్నదన్నారు. మీడియాలో విశ్లేషణలు చేసుకుంటే తప్పు లేదనీ, ప్రతిపక్ష పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మీడియా కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచిం దన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. దేశం నలుమూలల నుంచి బీజేపీ జాతీయ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పారు.బీజేపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్కు 10.4 శాతం ఓట్లు వచ్చినా వాటిని మీడియా ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.