Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
కాలువలో బాలుడు ఈత నేర్చుకునేందుకు దిగి మునిగిపో తుండగా.. అతన్ని కాపాడేందుకు దిగిన మరో వ్యక్తి.. అతనూ ఇద్దరూ మునిగిపోయి మృతిచెందారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో శుక్రవారం జరిగింది. ఏఎస్ఐ ఉమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐనవోలు మండలంలోని ముల్కలగూడెం గ్రామానికి చెందిన రాకేష్(10) కొన్ని రోజుల కిందట పీచర గ్రామంలో తమ బంధువైన వలపోజు రాజు(38) ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం ఇద్దరూ కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. పక్కనే ఉన్న కెనాల్ కాలువలో రాకేష్ ఈత నేర్చుకునేందుకు దిగి ప్రవాహంలో మునిగిపవోయాడు. వెంటనే రాజు కాల్వలోకి దిగి రాకేష్ను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, రాజును రాకేష్ గట్టిగా పట్టుకోగా.. ఇద్దరూ మునిగిపోయి మృతిచెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.