Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మృతి
- ముందుగా డివైడర్ను ఢకొీట్టిన కారు
- సహాయక చర్యల్లో ఉన్న వారిని ఢకొీట్టిన డీసీఎం
- సీఐ, కానిస్టేబుల్స్, స్థానికులకు తీవ్ర గాయాలు
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం వెంట ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢకొీట్టడంతో అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు, స్థానికులు కలిసి మృతదేహాలను బయటకు తీస్తుండగా.. వెనుక నుంచి డీసీఎం వచ్చి బలంగా ఢకొీట్టింది. దీంతో మరో ఇద్దరు మృతిచెందారు. పలువురి చేతులు, కాళ్లు విరిగాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజురాబాద్కు చెందిన అడ్వకేట్ నర్సింహారెడ్డి, ఆయన తండ్రి రాజిరెడ్డి, తల్లి విజయ కారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట పట్టణంలోని రంగీలా డాబా చౌరస్తా సమీపంలో కారు డివైడర్ను ఢకొీట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సిద్దిపేట టూ టౌన్ సీఐ పర్షరామ్ గౌడ్, ఎస్ఐ కనకయ్యగౌడ్ తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని.. స్థానికులతో కలిసి మృతదేహాలను ఆస్సత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వారిపైకి దూసుకొచ్చింది. దీంతో చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన మల్లేశం, మందపల్లి గ్రామానికి చెందిన ఎల్లారెఢ్డి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. సీఐతో పాటు కానిస్టేబుల్స్, 12 మంది స్థానికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని సీపీి, ఏసీపీ పరిశీలించారు.