Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
80 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు ఈనెల 9వ తేదీన హైదరాబాద్ నగరాన్ని సందర్శించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈసందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిం దిగా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరపున వారికి ఆతిధ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటనను ఏర్పాటు చేసింది. సీఎస్ నిర్శహించిన సమావేశంలో చీఫ్ ప్రోటోకాల్ నగేశ్సింగ్తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. విదేశీరాయబారులు, హైకమిషనర్ల పర్యటనా ఏర్పాట్లపై చర్చించారు. ఈసందర్భంగా వారు కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ తదితర సంస్ధలను సందర్శిస్తారు. నగరంలో వారు ప్రయాణించడానికి 5 లగ్జరీ బస్సులు, ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలో వ్యాక్సిన్ తయారీ సంస్థల తయారీ సామర్ధ్యం, వాటి పనితీరుపై ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. అలాగే ఫార్మాసిటీ, జీనోమ్ వ్యాలీని కూడా వారు సందర్శిస్తారని సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్పిపల్ సెక్రటరీ (పొలిటికల్) వికాస్రాజ్, రవాణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.