Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. వాటిపై పార్టీలో చర్చిస్తామని అన్నారు. ఫలితాల అనంతరం శుక్రవారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు టీఆర్ఎస్కు వచ్చిన సీట్ల కంటే 20 నుంచి 25 స్థానాలు అధికంగా వస్తాయని తాము భావించామని తెలిపారు. పది నుంచి పదిహేను సీట్లలో వంద, రెండొందల ఓట్లతో తమ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పారు. ఈ ఫలితాలతో నిరాశ చెందాల్సిన పనిలేదని అన్నారు. జీహెచ్ఎమ్సీలో టీఆర్ఎస్ను అతి పెద్ద పార్టీగా నిలిపిన ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేయర్ అభ్యర్థి ఎంపికకు ఇంకా రెణ్నెల్ల సమయం ఉందని వివరించారు. ఆ అంశంపై పార్టీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.