Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్తో బీజేపీ పోటీ పడేనా!
- ఉంటేనే.. ఎక్స్అఫీషియో అవసరం
- అప్పుడే ఎంఐఎం కీలకం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు చర్చంతా మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనే! 150 డివిజన్లకు జరిగిన పోటీలో 55 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానాన్ని 48 డివిజన్లలో విజయం సాధించి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 44 డివిజన్లలో గెలిచి మూడో స్థానంలో నిలువగా, కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. కోర్టు కేసు కారణంగా నేరేడ్మెట్ డివిజన్ ఫలితం పెండింగ్లో ఉంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య కేవలం ఏడు డివిజన్లు మాత్రమే వ్యత్యాసం ఉంది.
అయితే గ్రేటర్ మేయర్ పీఠంపై కూర్చోవాలంటే మేజిక్ ఫిగర్ 62 మంది సభ్యుల బలం ఉండాలి. ఆ సంఖ్యని ఏపార్టీ చేరుకోలేదు. కాకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు 52 మంది ఎక్స్అఫీషియోగా ఉన్నారు. బీజేపీ లేదా ఎంఐఎం పార్టీలు మేయర్ ఎన్నికల బరిలో నిలిస్తే ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం అవుతాయి. 52 మంది ఎక్స్అఫీషియోల్లో టీఆర్ఎస్కు 38 ఓట్లు ఉన్నాయి. ఎంఐఎంకు 10, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్కు ఒక్క ఎక్స్అఫీషియో ఓటు ఉంది. మేజిక్ ఫిగర్ 64ను చేరుకోనప్పటికీ ఎక్స్అఫీషియో బలాన్ని కలుపుకుంటే టీఆర్ఎస్కే మేయర్ పీఠం దక్కుతుంది. అందువల్ల బీజేపీ, ఎంఐఎంలు ప్రతిపక్షపాత్రకే పరిమితమవ్వాల్సి ఉంటుంది.