Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రద్దయ్యే వరకు పోరాటం
- రైతులకు అన్నివర్గాల మద్దతు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ - భువనగిరి
కార్పొరేట్ అనుకూల, రైతుల పాలిట శాపమైన దుర్మార్గపు వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలిపారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుజాతా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్ట, భువనగిరి, వలిగొండ, ఆలేరు ప్రాంతాల్లో సాగంది. ఈ సందర్భంగా సీతారాములు, సాగర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలని కోరుతూ చేపట్టిన బస్సుజాతాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఢిల్లీలో తీవ్రమైన చలితోపాటు వర్షం వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా రైతులు చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారని చెప్పారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఫ్ు కూడా కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరినా నరేంద్రమోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల ఆందోళనకు దేశంలోని ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, సైనికు లతోపాటు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలిపారన్నారు. చట్టాలు మంచివని లోక్సత్తా నాయకుడు చెప్పడం బాధాక రమన్నారు. 2006లో వ్యవసాయ మార్కెట్లను బీహార్లో రద్దు చేశారని.. దాంతో అక్కడ ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. బ్లాక్ మార్కెట్ను నియంత్రించడానికి 1955లో తెచ్చిన నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 18 నుంచి 26 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 26న జాతీయ జెండాలతో హైదరాబాద్లో గవర్నర్కు వినతి, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని కోరారు. రైతు ఉద్యమాన్ని 56 దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా పరిశీలిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ చట్టాలను మొదట వ్యతిరేకించి, అనంతరం యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఈ జాతాకు యూటీఎఫ్, కాంగ్రెస్, సీపీఐ, టీడీఎఫ్ ఇతర ప్రజా సంఘాలు ఘనస్వాగతం పలుకుతూ మద్దతు తెలిపాయి. జాతాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రెడ్డి, మంగ నరసింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోబన్ తదితరులు పాల్గొన్నారు.