Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రొఫెసర్ శాంతాసిన్హా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు అవసరమని యం.వి.ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్లో మంగళవారం ఆమె అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)-2021 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం గుర్తిస్తూ వాటి పరిష్కారం కోసం ఐద్వా పోరాడుతున్నదనీ, మహిళా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఐద్వా ఉంటుందని అభిప్రాయపడ్డారు.. మహిళా హక్కులతో పాటు వారిపై జరుగుతున్న హింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడటం తక్షణ కర్తవ్యంగా గుర్తించాలని సూచించారు. ఐద్వా చేస్తున్న ఉద్యమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎన్. ఆశాలత, మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు అరుణ జ్యోతి, ప్రభావతి, వినోద, రాష్ట్ర కమిటి సభ్యులు యం.స్వర్ణలత, మస్తాన్ బీ పాల్గొన్నారు.