Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యవసర విచారణకు తిరస్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్ట్కు గ్రావిటేషన్ విధానంలో నీటిని తరలించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలనే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అత్య వసరంగా విచారణ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా విచారణ ఎందుకు చేయాలో తెలియజేస్తూ మరో పిటిషన్ వేస్తే దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.