Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారంరోజుల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీల, సిలబస్, ప్రాక్టికల్స్పై స్పష్టతనిస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 9,10, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతులు కొనసాగుతాయని వివ రించారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్లో మంత్రి ప్రత్యేక సమావే శం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహ ణకు ప్రతి విద్యాసంస్థ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఈనెల 25 నాటికి విద్యాసంస్థలను తెరిచేందుకు సిద్ధం చేయాలని కోరారు. జాతీయస్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల సిలబస్కు అనుగుణంగా ఎంసెట్ పరీక్షకు సంబంధించిన సిలబస్ విషయంలో స్పష్టతనిస్తామని వివరించారు. విద్యాసంస్థలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రయివేటు యాజమాన్యాలు సహకరించాలని కోరారు. విద్యార్థులు పాఠశాలలకు తప్పనిసరిగా హాజరు కావాలన్న ఒత్తిడిని యాజమాన్యాలు చేయొద్దని కోరారు. ఈ సందర్భంగా ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్పిన సమస్యలను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కోవిడ్ కారణంగా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను రద్దు చేయాలని విద్యామంత్రిని కోరామని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీష్ చెప్పారు.